ఒకానొకవూళ్ళో, సోమిలకుడు అనే నేతగాడు వుండేవాడు. అతడు యెంత చక్కని దుస్తులు నేసినా అమ్మకానికి పెట్టేసరికి, అతనికి దినసరి ఖర్చులకు సరిపడా డబ్బులు వచ్చేవికానీ, ధనం దాచుకుని పెద్ద అవసరాలు తీర్చుకునే అవకాశం రావడం లేదు. తోటివారు యింతకంటే, నాసిరకం బట్టలు నేసినా, వారికి పుష్కలంగా డబ్బువచ్చేది.
ఈపరిస్థితి యెక్కువ రోజులు భరించలేక, ఒకరోజు సోమిలకుడు భార్యతో, ' నాకు వున్న వూరిలో అచ్చిరావడం లేదనుకుంటాను, భార్యామణీ ! నేను వర్ధమానపురం నగరానికి వెళ్లి అక్కడ బాగాకష్టపడి డబ్బు సంపాదించుకుని వస్తాను. అప్పటిదాకా కొద్దిగా జాగ్రత్తగా వుండి, ఇల్లు చూసుకో ! ' అని భార్యకు చెప్పాడు.
సోమిలకుడు చెప్పిన దానికి అతని భార్య ఒప్పుకోలేదు. ' నువ్వు యెంతదూరం వెళ్లి కష్టపడినా, మనకు దక్కవలసిందే మనకు దక్కుతుంది. మనది కానిది ఒక్క నాణెం కూడా యెక్కువరాదు. ఎందుకు ఇంటిపట్టున వుండి పనిచేసుకోక దూరభూమి వెళ్లి బాధపడతావు ? నా మాట విను. మనం చేసే పనులకు, విధి కూడా సహకరించాలి. అంతవరకూ యెంత కష్టపడినా ఏమీ ప్రయోజనం వుండదు. ' అని చెప్పింది.
ఆమె చెప్పేమాటలు శుష్కవేదాంతం లాగా అనిపించింది సోమిలకుడికి. అందుకనే భార్యతో, ' మనం కష్టపడితే విధికూడా మనలను ఆదుకుంటుంది. నేను వెళ్ళవలసినదే.' అని పట్టుపట్టి వర్ధమానపురం నగరానికి బయలుదేరాడు.
ఆవిధంగా నగరానికి వెళ్లిన సోమిలకుడు, మూడు సంవత్సరాలు అమితంగా కష్టపడి, 300 బంగారుకాసులు సంపాదించి, తన గ్రామానికి తిరిగి ప్రయాణమయ్యాడు. దారిలో అడవి మార్గం గుండా వస్తూ, చీకటిపడగానే ఒక చెట్టు యెక్కి పడుకున్నాడు, తన బంగారు కాసులు భద్రంగా మూటకట్టి పెట్టుకుని.
అయితే అర్ధరాత్రి పూట యెవరో యిద్దరు మాట్లాడుకుంటున్నట్లు వినబడుతుంటే, చెవులు రిక్కించి వినసాగాడు. అందులో విధి అనబడేవాడు , ' సోమిలకుడు తన యెంత కష్టపడినా కేవలం తిండికీ, బట్టకూ సరిపడే సంపాదనే వుండాలని వ్రాసివున్నది కదా ! ఎందుకు అతనికి యిన్ని బంగారుకాసులు వచ్చేటట్లు చేసావు ? ' , అని పనిదేవతను అడిగాడు. దానికి పనిదేవత, ' అతడు కష్టపడ్డాడు, నేను యిచ్చాను. తరువాత నీ ఇష్టం. ' అన్నది. ఆమాటలువినగానే, సోమిలకుని నిద్ర అంతా ఎగిరిపోయి, తన బంగారు కాసుల మూట తడుముకున్నాడు. అంతే ! గుండె గుభేలుమన్నది. బంగారుకాసులు మాయమైనాయి. ఖాళీమూట మాత్రం మిగిలింది.
సోమిలకుడు ఉస్సురంటూ, చెట్టు దిగి, ' ఇప్పుడు ఏమొహం పెట్టుకుని నావూరువెళ్లి, నా భార్యకు, స్నేహితులకు జరిగింది చెప్పగలను ? ' అనుకుంటూ, తిరిగి వర్ధమానపురం వచ్చాడు. ఈసారి ఇంకాబాగా కష్టపడి, సంవత్సర కాలంలోనే 500 బంగారు కాసులు సంపాదించుకుని, తమ వూరికి తిరిగి ప్రయాణమయ్యాడు. ఈసారి దారిలో యెక్కడా ఆగకుండా ఇంటికి సరాసరి వెళ్తూ వుండగా, బాగా అలసిపోయాడు.
అయినా అలా సోమిలకుడు నడుస్తూ వుండగా, మళ్ళీ వెనుకటి వ్యక్తుల కంఠాలే వినబడసాగాయి. చెవులు రిక్కించి విన్న సోమిలకుడికి, మళ్ళీ అర్ధమైంది, తనకు కేవలం తిండి బట్ట మాత్రమే ప్రాప్తం, బంగారు కాసులు తనకు అందని విషయమని. వారు మాట్లాడుకోవడం. తరువాత చూసుకుంటే, ఈసారికూడా బంగారుకాసులు మాయమైనాయి. విధి తనకు ఆధనం చేరకుండా అడ్డుపడుతున్నదని తెలుసుకున్నాడు, సోమిలకుడు. ' పనిదేవత అనుగ్రహించినా, విధి నన్ను ధనవంతుని చేయడానికి ఒప్పుకోవడం లేదు. ' అని అర్ధం చేసుకున్నాడు.
అయితే, ఈసారి జరిగిన భంగపాటుకు, సోమిలకుడు తట్టుకోలేక పోయాడు. తన కష్టానికి తగిన ఫలితం దక్కలేదని, నిస్పృహతో, ప్రక్కనే వున్న గడ్డిని ఉరిత్రాడుగా పేనుకుని, ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోబోయాడు.
సరిగ్గా అదేసమయంలోఆకాశం నుండి ఒక కంఠం, ' సోమాలికా ! ఆగు ! నేను విధిని మాట్లాడుతున్నాను. నేనే నీ బంగారు కాసులు మాయం చేశాను. నువ్వు నీ ఆహారం, దుస్తులకంటే ఎక్కువ సంపాదించుకుంటే నేను సహించలేకపోయాను. ఎందుకంటే, నీవు నీకు సరిపడా అవసరాల నిమిత్తమే ఆర్జించుకుని ప్రశాంతంగా బ్రతకాలని నీకు వ్రాసి పెట్టి వున్నది. అధిక సంపాదనతో నీవు లోభత్వం పొందే అవకాశం వున్నది. నీ జీవితమూ, నీ భార్య జీవితమూ ఆ లోభత్వం వలన కష్టాల పాలు అయ్యే సూచనలు వున్నాయి. అందుకనే, నీ మేలు కోరి నిన్ను కనీస ఖర్చులకు మాత్రం సంపాదించుకునే వాడిగా మాత్రమే చూసుకుంటున్నాను. ' అన్నది.
దానికి సోమిలకుడు ఒప్పుకోలేదు. ' ధనం వున్నవాడిని అందరూ గౌరవిస్తారు. భార్యకూడా అదుపు ఆజ్ఞలలో వుంటుంది. ధనంలేకపోతే కట్టుకున్న భార్య కూడా లెక్కజేయదు. స్నేహితులు దగ్గరకు రారు. నేను పిసినారివాడినైనా పరవాలేదు. కానీ ధనవంతుడిని కావాలి. ' అని విధితో గట్టిగా చెప్పాడు.
అప్పుడు విధి, సోమిలకుని, వర్ధమానపురం లో వున్న ఇద్దరు వ్యక్తులు, గుప్తధనుడు,, ఉపభుక్తధనుడు అనే వారి జీవన విధానం పరిశీలించి వచ్చి తనకు చెప్పమన్నది. ఎవరి జీవన విధానం సోమిలకునికి నచ్చితే ఆవిధంగా చేద్దామన్నది.
అదే విధంగా సోమిలకుడు ముందుగా గుప్తధనుడి ఇంటికి వెళ్లగా, వారు యెంతో అమర్యాదగా ఇతనిని వెళ్లగొట్టబోగా, ఒక్క పూట ఆశ్రయం అడిగాడు. వారు అతికష్టంమీద ఒప్పుకుని, తమతో పాటు ఉంచుకున్న ఉదయం వండిన ఆహార పదార్ధాలను వారు తినగా, మిగిలినవి పెట్టారు. ఒక చింకిచాప యిచ్చి దూరంగా పడుకోమన్నాడు. వారూ అలాంటి దుర్భరమైన జీవితాన్నే అనుభవిస్తున్నారు. అర్ధరాత్రి పూట వారిమాటలు విని తనను ఉదయాన్నే వెళ్లగొట్టమని అతని భార్యా పిల్లలూ గుప్తధనునికి చెబుతుంటే, తెల్లవారకుండానే అక్కడినుండి బయటపడ్డాడు సోమిలకుడు.
ఇక ఉపభుక్తధనుని కలవగా ఆయన ఆదరంగా ఆహ్వానించి, ధనం లేకపోయినా కావలసిన సరుకులు అప్పుగా తీసుకువచ్చి, సోమిలకునికి ఏలోటూ లేకుండా రోజంతా చూసుకుని, తన పిల్లల పడకగదిలో చక్కని మంచం యేర్పాటు చేసి, ఆదరించాడు. ఎన్ని రోజులు కావాలంటే అన్నిరోజులువుండమన్నాడు. ఇతనికి ఇంతధనం ఎక్కడ నుండి వస్తున్నది అని ఆలోచిస్తుండగా, ఆనగరం అధికారివచ్చి ఆయన చేసే ధర్మకార్యాలు తన కళ్ళముందే ధనం ఇచ్చివెళ్ళాడు.
అప్పుడు అర్ధమైంది, సోమిలకునికి కేవలం ధనం వుండగానే సరిపోదు. దానిని ఖర్చుపెట్టే విధానం తెలియాలి అని. అది తనకు తెలియజెప్పడం కోసమే, విధి ఈవిధంగా చేసిందని సంతోషించి, తిరిగి విధి దగ్గరకువచ్చి, తనకు ఉపభుక్తధనుని జీవితం నచ్చిందని, చెప్పాడు. ధర్మకార్యాలు చేస్తూ వుంటానని, ఆనందంగా సోమిలకుడు విధికి చెప్పాడు. విధి కూ