Sunday, 16 May 2021

శ్రీ కృష్ణ సందేశం 8. 1 మహాభారతం

 ఎప్పుడైనా ఒక వ్యక్తికీ ఏదైనా ఘటనలో అన్యాయం జరిగింది అనిపిస్తే ఆ ఘటన అతని అంతరంగాన్ని టీవీరంగా కుదిపేస్తుంది . సమస్త జగత్తు అతనికి శత్రువులాగే కనిపిస్తుంది. అన్యాయం అనిపించిన ఘటన ఎంత పెద్దదైతే మనుషుల హృదయం కూడా అంతే విరోధించసాగుతుంది. ఆ ఘటనకు బదులుగా వారు న్యాయమడుగుతారు. నిజానికి ఇది సరైనదే. 

వాస్తవానికి సమాజంలో ఏ విధమైన అన్యాయమైన వ్యక్తుల ఆసరాకు, నమ్మకానికి వినాశకరం. కానీ ఇంతకీ ఈ న్యాయం అంటే ఏమిటి? ఈ న్యాయానికి అర్థమేమిటి? 

అన్యాయం చేసినవారు నిజానికి తాము చేసినదానికి పశ్చాత్త్తాపం చెందాలి. అలాగే అన్యాయానికి గురైన వ్యక్తి మనస్సులో మరలా సమాజం పట్ల విశ్వాసం కలగాలి. న్యాయానికి అర్ధం ఇదేగా. 

కానీ ఎవరి హృదయాలందు ధర్మం ఉండదో వారు న్యాయాన్ని వదిలేసి వైరాన్ని, ప్రతీకారాన్ని ఆశ్రయిస్తారు. హింసకి బదులుగా ప్రతిహింస అనే భావనతో సాగుతారు. తాము అనుభవించిన బాధ కంటే ఎంతో అధిక బాధని కలిగించ ప్రయత్నిస్తారు. 

ఈ మార్గం లో నడుస్తూ అన్యాయానికి బలైన వారే స్వయం గా అన్యాయం చేస్తారు. దీంతో వారూ అపరాధులవుతారు. 

అంటే న్యాయానికి, ప్రతీకారాన్ని మధ్య చాలా తక్కువ అంతరమే  ఉంటుంది. అలాంటి అంతరం పేరే ధర్మం. 

No comments:

Post a Comment