ఎవరికైనా అపరాధానికి దండన లభిస్తే అటువంటప్పుడు అది అన్యాయమని ఆ వ్యక్తి మనస్సు రోదిస్తుంది. తాను ఆ అపరాధం చేసినప్పుడు తన ఆలోచనలు భిన్నంగా ఉండేవని ఆ మనస్సుకు అనిపించవచ్చు. అపరాధం జరిగాక ఆ వ్యక్తి దానికి పశ్చాత్త్తాపం చెందాడు. తన ఆలోచనలలో పరివర్తన వచ్చింది. మరి ఆ వ్యక్తికీ దండన ఎందుకు లభించింది?
నిజానికి ఒక చర్య జరిగిందంటే దానికి ప్రతిచర్య కూడా అనివార్యం. కర్మానుసారమే ఫలితం ఉంటుంది.
ఇంకొకరికి ప్రేమ పంచితే సుఖం ప్రాప్తిస్తుంది. ఇంకొకరిని హత్య చేస్తే మృత్యుదండన లభిస్తుంది. చేసిన కార్యాన్ని బట్టే న్యాయం కూడా.
అయితే పశ్చాత్త్తాపానికి మరి ఏ విలువా లేదా? ఉంది. అవశ్యం ఉంది. పశ్చాత్త్తాపం మరియు ప్రాయశ్చిత్తం వల్ల మనిషికి ఆత్మా బలం పెరుగుతుంది. రానున్న దండనను స్వీకరించడానికి మనిషిని ఆయత్తం చేస్తుంది. అయితే ప్రాయశ్చిత్తం లేకుండా దండనను స్వీకరించడంలో ఫలితం ఉంటుందా? ఆలోచించండి.
No comments:
Post a Comment