Tuesday, 25 May 2021

శ్రీ కృష్ణ సందేశం 21. 1 మహాభారతం

ఈ జగత్తులో జన్మించే ప్రతి శిశువు ఎటువంటి గుణ దోషాలు లేకుండా జన్మిస్తాడు. వాని అంతరాత్మలో ఎటువంటి సత్సంస్కార లక్షణాలు గాని, దుస్సంస్కార లక్షణాలు గాని ఉండవు. అనగా జన్మతః పిల్లలలో ఎటువంటి గుణాలు గాని, దోషాలు కానీ ఉండవు. అయితే ఈ గుణదోషాలన్నవి ఏ విధంగా ప్రాప్తిస్తాయంటారు?

తమ తల్లిదండ్రుల నోట నిరంతరం వినే మాటల యొక్క ప్రభావమే వారి సంతానం యొక్క హృదయ సంస్కారాన్ని తీర్చిదిద్దుతుంది. ఎలాగంటే, గ్రామం లోని నదికి వెళ్లే మార్గంలో జనం పడే పడే నడవడం వాళ్ళ ఒక కాలిబాట ఏర్పడుతుంది. అనగా, అమ్మా నాన్నల మనస్సులోని కోరికలే వారి సంతానానికున్న సంస్కారంలోని దోషం లేదా గుణమై ప్రతిఫలిస్తాయి. ఇది సత్యం కాదంటారా?

అయినప్పటికీ తమ సంతానంలో ఏదైనా దోషం కనిపించినప్పుడు వారి తల్లిదండ్రులు ఆశ్చర్యంతో, దుఃఖంతో దిగ్భ్రాంతులవుతారు. వారి హృదయం వారిని నిలదీసి ప్రశ్నిస్తుంది. తమ సంతానానికి ఇంతటి కుసంస్కారం ఎలా వచ్చింది అని. 

సత్యమేమిటంటే పిల్లలలో తల్లిదండ్రులు అనాలోచితంగానే అయినా కుసంస్కార బీజాలను నాటుతుంటారు. అవి వారి పిల్లల మనోఫలకం మీద కుసంస్కార వృక్షాలై పెరుగుతాయి. 

అనగా తమ సంతానం సంస్కారవంతంగాను, ధర్మబద్ధంగాను ఉండాలని ఆశించే ప్రతి తల్లి, తండ్రి ముందుగా తమ మనస్సులోని కోరికలను నియంత్రించుకోవడం అనివార్యం కదా. ప్రతి తల్లి, తండ్రి ఈ విషయం గురించి అవశ్యం ఆలోచించాలి. 

No comments:

Post a Comment