ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఃఖం లభించి ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే మనసుకు తప్పకుండా అనిపించవచ్చు. అలా సత్కార్యాలే చేయడం వల్ల , ధర్మాన్ని అనుసరించడం వాళ్ళ కలిగే ప్రయోజనమేమిటీ అని.
కానీ దుష్టాత్ములకు ఏమి లభిస్తుందో ఎప్పుడైనా గమనించారా? దుష్ట కార్యాలు తలపెట్టేవారి హృదయం ఎప్పుడూ అల్లకల్లోలంగా, ఎంతో చిరాకుగా ఉంటుంది. ఆ మనస్సులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తూ ఉంటాయి. అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. ఇదేనా సుఖం అంటే?
అయితే ధర్మ మార్గాన నడిచేవారు సత్కార్యాలు చేసేవారు, సచ్చీలురైన వ్యక్తుల మనస్సులు సర్వదా ప్రశాంతంగా ఉంటాయి. పరిస్థితులేవీ వారి జీవన గమనంలో బాధింపులుగా ఉండవు. సమాజంలో గౌరవమర్యాదలు, మనసుకి సంతోషం లభిస్తాయి వారికి.
అనగా, సత్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో లభించే సుఖాలకి మార్గం కాదు. సుఖానికి నిర్వచనే సత్ప్రవర్తన.
అదేవిధంగా దుష్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో ఎదురయ్యే దుఃఖాలకి మార్గం కాదు. అధర్మం చేసిన మరుక్షణమే అది దుఃఖాలను ఉత్పన్నం చేస్తుంది. ధర్మం ఆచరిస్తే సుఖం రాదు. ధర్మానికి మరో పేరే సుఖం.
No comments:
Post a Comment