అంకితభావంతోనే సదా జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇది మనందరికీ తెలుసు. కానీ అంకితభావంతో ఉన్న గొప్పదనం ఏంటి? ఇదెప్పుడైనా మనం ఆలోచించామా?
జ్ఞాన ప్రాప్తికి సదా మనిషి మనస్సు విభిన్న సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది. ఒకసారి ఇతర విద్యార్థుల పట్ల ఈర్ష్య కలిగిస్తుంది. ఇంకొకసారి నేర్చుకున్న పాఠాలలో సందేహాలు కలిగిస్తుంది. మరొకసారి గురువు వేసిన శిక్ష వలన మనసును అహంకారంతో నింపేస్తుంది. కాదా? ఇలా జరగదంటారా?
ఎవరికీ తెలుసు ఎన్ని రకాల ఆలోచనలు మనసును కలవరపెడతాయో, మనస్సులో కలిగే ఇటువంటి అనిశ్చిత స్థితి కారణంగా మనం జ్ఞానాన్ని పొందలేకపోతుంటాం.
మనస్సుకు నిశ్చల స్థితి కేవలం అంకితభావంతోటే వస్తుంది. అంకిత భావం అహంకారాన్ని నాశనం చేస్తుంది. ఈర్ష్య, వ్యామోహం వంటి భావనలను దూరం చేసి హృదయాన్ని శాంతింపజేసి మనస్సుకు ఏకాగ్రతనిస్తుంది.
వాస్తవానికి ఈశ్వరుని సృష్టిలో జ్ఞానానికి అవధి లేదు. జ్ఞానులకూ లేదు. దత్తాత్రేయులవారు ఆనాడు గోవు నుంచి, శునకం నుంచి కూడా జ్ఞానాన్ని సంపాదించారు.
అనగా విషయం బ్రహ్మజ్ఞానం కావచ్చు, లేక లోక జ్ఞానం కావచ్చు, లేక గురుకులంలో పొందే జ్ఞానమూ కావచ్చు. దాన్ని పొందడానికి గురువుకన్నా అధిక ప్రాధాన్యం ఆ గురువు పట్ల మనకున్న అంకితభావానిదే. ఇది సత్యం కాదనగలరా? మీరే ఆలోచించండి.
No comments:
Post a Comment