Friday, 1 April 2022

రైతు vs ఇంద్రుడు

ఇంద్రుడు ఒక రోజు ఆకాశ మార్గాన వెళ్తుండగా ఒక పేద రైతు పొలం దున్నుతు కనిపించాడు.. 

నేను రోజు ఇక్కడ వర్షం కురవాలని చెప్పలేదే ? మరి ఎందుకు రైతు దున్నుతున్నాడు 

అని సందేహము కలిగినది.

వెంటనే మారు వేషం లో రైతు దగ్గరకు వెళ్ళి అడిగాడు. 

రైతు 

నాకెందుకో రోజు వర్షం కురుస్తుంది అనిపించింది, అందుకే దున్నుతున్నాను

అన్నాడు. 

ఇంద్రుడు విని ఇక దున్నవద్దు, వర్షం రాదని చెప్పి వెళ్ళిపోయాడు. 

కాని రైతు దున్నడము మానలేదు.

ఇంద్రునికి కోపము వచ్చిన్ది.

వరుణుడి ని పిలిపించి అక్కడ వర్షం పడకూడదు అని చెప్పాడు. 

వరుణుడు సరే కానీ చల్లని గాలి వీస్తే మాత్రమ్ నేను ఏమీ చేయ్యలేనన్నాడు.. 

పవనుడి ని పిలిపించి అక్కడ చల్లని గాలి వీచకుడదు అని చెప్పాడు.

దానికి పవనుడు సరే కానీ అక్కడ కప్పలు అరిస్తే మాత్రమ్ నేను ఏమీ చెయ్యలేను అన్నాడు.

ఇంద్రుడు కప్పల నాయకుడిని పిలిపించి విషయం చెప్పాడు ,

కప్పల నాయకుడు మేము రోజు అస్సలు అరవము...కానీ మినుగురు పురుగులు మిణుకు మిణుకు మని కనిపిస్తే మాత్రమ్ మేము ఏమీ చెయ్యలేము అన్నాడు..

ఇంద్రుడు వాటినీ పిలిపించి రాత్రి మీరు బయటకు రాకూడదు అని చెప్పాడు, 

అవి సరే మేము అస్సలు రాత్రి బయటకు రామని చెప్పాయి.

ఇంద్రుడు ఇంక వర్షం యెలా కురుస్తుందో చూద్దామ్ అనుకొన్నాడు..

కానీ రాత్రి వర్షం కురిసింది..

ఇంద్రునికి అవమానం తొ పట్టరాని కోపము వచిన్ది.

అందరినీ పిలిపిన్చాడు.

వరుణుడు చల్లగాలి వీచిన్ది మహరాజ అన్నాడు..

పవనుడు కప్పలు అరవడం వల్లే వీచానన్నడు... 

కప్పలు మినుగురులు మిణుకు మిణుకు మని మేరవడమ్ వల్లే అరిచాము అన్నవి..

మిణుగురు పురుగులు మేము మాత్రమ్ అస్సలు బయటకు రాలేదు అన్నవి... 


ఇంద్రుని కి ఏమీ జరిగిందో పాలుపోలేదు..

నారదుని కి విన్నవించారు.

నారదుడు రాత్రి జరిగినది చెప్పాడు.

రైతు రాత్రి పోలములో తన పని పూర్తి కాకపోతే తన భార్యా పిల్లలతో కలసి దీపాలు వెలిగించుకొని దున్నుతూ ఉన్నారు..

దీపాల మిణుకు మనే వెలుగు చూసి కప్పలు మిణుగురు పురుగులనుకొని పొరపాటు పడ్డాయి.. 

కప్పలు అరవడం తొ చల్లటి గాలి వీచిన్ది... 

దానితో వర్షం కురిసింది అని చెప్పాడు......


" నమ్మకం తో ప్రయత్నం చేసినవారు వారు ఎన్నడూ నష్టపోరు." నమ్మి కష్టం చేసేవారికి మహా లక్ష్మీ దేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది .




No comments:

Post a Comment