ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం శ్రీ గురుభ్యోనమః`
ప్రథమాధ్యాయము.
అర్జున విషాదయోగః
9
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం |
పర్యాప్తం త్విదమేతేషామ్ బలం భీమాభిరక్షితం ||
అపర్యాప్తం = అపరిమితమైన; తత్ =అది ; అస్మాకం =మనయొక్క ; బలం =సైన్యబలము; భీష్మాభిరక్షితం = భీష్మునిచేత రక్షింపబడుతుంది; పర్యాప్తం = పరిమితమైన ; తు=కాని ; ఇదం=ఈ; ఏతేషామ్=పాండవులయొక్క ; బలం = సైన్యబలము ; భీమాభిరక్షితం=భీమునిచేత రక్షింపబడుతున్నది.
మన సైన్యబలం అపరిమితంగా లెక్కించడానికి వీలు లేనంతగా ఉంది, ఇంకా మనం పితామహులు భీష్మునిచేత సంపూర్ణంగా రక్షించబడుతున్నాం. కానీ భీమునిచేత రక్షించబడుతున్న పాండవుల సైన్యం పరిమితంగా ఉంది.
భాష్యం : ఇక్కడ దుర్యోధనుడు రెండువైపులా సైన్యబలాలను అంచనా వేస్తున్నాడు. అత్యంత అనుభవజ్ఞుడైన సేనాధిపతి యైన భీష్మ పితామహుని చేత రక్షించబడుతున్న తన సైన్యం అపరిమితంగా ఉన్నట్లు తాను భావించాడు. అదే సమయంలో భీష్ముని ముందు తృణపాయం లాంటి తక్కువ అనుభవం ఉన్న సేనాని భీముని చేత రక్షించబడుతున్న పాండవ సేనాబలం పరిమితం గా ఉన్నట్లు అతనికి అనిపించింది. దుర్యోధనుడు ఎప్పుడూ భీముని పట్ల అసూయతోనే ఉన్నాడు. తాను చనిపోవలసి వస్తే భీముని చేతిలోనే చావు ప్రాప్తిస్తుందని అతనికి తెలిసి ఉండడమే ఆ అసూయకు కారణం. కానీ అదే సమయంలో ఉత్తమ సేనాధిపతి యైన భీష్ముని రక్షణని తలుచుకొని ఆటను తన విజయం పట్ల పూర్తి విశ్వాసం తో ఉన్నాడు. యుద్ధ భూమిలో తనకి విజయం అనివార్యం అని అతను తన గురువుకి చెప్తున్నాడు.
No comments:
Post a Comment